ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ప్రపంచ దేశాలను భయపెట్టిస్తున్నాయి.ఇక్కడ వారికి సాయం చేయాలని ఇతర దేశాలు చూస్తున్నాయి.
అయితే పరిస్థితి ఇలానే కొనసాగితే చాలా దారుణంగా ఉంటుందని అంటున్నారు.అందుకే ఇండియాలో మరోసారి లాక్ డౌన్ విధించాల్సిందే అని అంటున్నారు అమెరికా ఎపిడెమియాలజిస్ట్ ఆంటోనీ ఫౌసి.
దేశంలో కరోనా కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అన్నారు.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై స్పందించారు.
మరోసారి లాక్ డౌన్ పెట్టాల్సిందే అని సూచించారు.అంతేకాదు ఆక్సిజన్ సరఫరాలు పెంచాలని అన్నారు.
మందులు, పీపీఈ కిట్లను కూడా కావాల్సినన్ని సమకూర్చుకోవాలని సూచించారు.
ఒక సెపరేట్ గ్రూపుని ఏర్పాటు చేసి ఈ సంక్షోభం నుండి భయపడేలా.
దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ఏర్పాటు చేయాలని అన్నారు.కరోనాని కట్టడి చేసేందుకు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
కొన్ని దేశాలు తాము కరోనానని గెలిచామంటూ సంబరాలు చేసుకుంటున్నాయని అన్నారు ఆంటోనీ ఫౌసి.చైనాలో ఏడాది క్రితం కేసులు మొదలైనప్పుడు లాక్ డౌన్ చేశారని.
అయితే నెలల పాటు కాకుండా కొన్నాళ్లు లాక్ డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు.అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని అన్నారు.