ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ “పుష్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండగా హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ కూడా మొదలైంది.అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ మోడల్ మరియు నటి ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే నిన్న మొన్నటి వరకు ఇదే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని కూడా నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపించాయి.అయితే కియారా అద్వాని పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు తెలుస్తోంది.
అయితే ఊర్వశి రౌతేలా బాలీవుడ్లో పలు గ్లామరస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను బాగానే మెప్పించింది.కానీ తన నటనను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి “వర్జిన్ భానుప్రియ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం జూన్ నెలలో విడుదల కానున్నట్లు సమాచారం.