ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా.మోడలింగ్ లో ఓ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వెండితెర పై స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.
ఇక తన గ్లామర్ ఫోటోలతో ప్రతిరోజు తన సోషల్ మీడియా ఖాతాను నింపేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో యువతను బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
తన డాన్స్ లతో బాగా రచ్చ చేస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఎంతో మంది నిరుపేదలకు , రోడ్డు పక్కన అనాథలకు కొంత మంది సెలబ్రెటీలు భోజన సదుపాయాలు అందిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశి రౌతేలా కూడా సోషల్ సర్వీస్ లో బాగా బిజీగా మారింది.
రోడ్డు పక్కన నివసించే అనాథ పిల్లలకు, చిన్నపిల్లల తల్లులకు భోజనాన్ని అందించింది.ప్రస్తుతం ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకోగా వైరల్ గా మారాయి.
ఇది చూసిన నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.కొందరు తను చేస్తున్న సహాయాన్ని మెచ్చుకోగామరికొందరు తను సహాయం చేయడం కంటే పబ్లిసిటీ ఎక్కువగా చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా వారికి భోజనాల ప్యాకెట్లను అందించేటప్పుడు కూడా ఫోటోలకు ఫోజ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కొంత వరకు సమయం చేయగా వాటిని పబ్లిసిటీ చేయడంతో నెటి జనులు మండిపడుతున్నారు.
ఇక మరికొందరు సెలబ్రెటీలు తమ వంతు సహాయాన్ని చేస్తూవాటిని ఎటువంటి సోషల్ మీడియా ప్రచారం చేయకుండా తమ మానవత్వాన్ని చాటి చూపుతున్నారు.