బాలీవుడ్ లో హాట్ బాంబుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ ఊర్వశి రౌటేల టాలీవుడ్ ఎంట్రీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది.అనుకున్నట్లు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
దీనిని బ్లాక్ రోజ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు.మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది.
సంపత్ నంది సిటీ మార్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం వచ్చిన భామని ఏకంగా ఇప్పుడు టాలీవుడ్ లో లేడీ ఒరియాంటెడ్ మూవీతో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ–షేక్స్పియర్ రచించిన ద మర్చంట్ ఆఫ్ వెనిస్ లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్గా బ్లాక్ రోజ్ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ను జోడిస్తూ ఈ సినిమా కథనం ఉండబోతుందని అన్నారు.మొత్తానికి పవర్ ఫుల్ స్టొరీ ద్వారానే సంపత్ నంది ఊర్వశిని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు.
ఇప్పటికే యాక్టింగ్ పరంగా అంతంత మాత్రమే మార్కులు సొంతం చేసుకున్న ఊర్వశి తెలుగులో తెరంగేట్రం చేసిన బ్లాక్ రోజ్ మూవీలో ఉన్న పవర్ ఫుల్ పాత్రకి ఎంత వరకు న్యాయం చేస్తుందో అనేది చూడాలి.ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించడం అదనపు ఆకర్షణ