బాలీవుడ్లో నటిగా మోడల్ గా హీరోయిన్ ఊర్వశి రౌతేలా బాగానే పేరు సంపాదించుకుంది.అయితే పాత్రకి తగ్గట్టుగా అందాలు ఆరబోయడంలో కూడా ఊర్వశి అసలు వెనుకాడదు.
అయినప్పటికీ ఈ అమ్మడికి తన నటనను నిరూపించుకునేందుకు ఇప్పటివరకు సరైన అవకాశం రాక గుర్తింపుకి నోచుకోలేక పోయింది.అయితే ఈ మధ్యకాలంలో ఊర్వశి రౌతేలా చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.
అయితే ఇంతకీ ఊర్వశి రౌతేలా చేసినటువంటి ఆ పొరపాటు ఏంటో ఒకసారి లుక్కేద్దాం.
అయితే ఇటీవల కాలంలో పారాసైట్ అనే చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ చిత్రం గురించి ప్రముఖ రచయిత ట్వీట్ రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అయితే ఈ విషయాన్ని ఊర్వశి రౌతేలా కూడా అక్షరం పొల్లుపోకుండా సేమ్ టు సేమ్ కాపీ చేసి తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసింది.
దీంతో నెటిజన్లు ఎవరో హావభావలని కాపీ కొట్టడం సరికాదంటూ ఊర్వశి రౌతేలా గద్దిస్తున్నారు.అయితే గతంలో కూడా ఊర్వశి ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ ని కాపీ కొట్టి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అయితే ఒకసారి అంటే ఓకే గాని ఇలా ప్రతిసారి ఇతరుల ట్వీట్లను కాపీ కొట్టడం మంచిది కాదంటూ పలువురు ఊర్వశిని నిందిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి రౌతేలా “వర్జిన్ భాను ప్రియ” అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రం కామెడీ డ్రామా తరహాలో ఉండనుంది.అయితే ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ లోహ న్ దర్శకత్వం వహిస్తున్నాడు.