టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
ఇక బన్నీ చాలా మాస్ లుక్లో ఈ సినిమాలో నటిస్తుండటంతో పుష్ప చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుండగా, ఈ సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్ ఉండనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.కాగా ఈ మాస్ సాంగ్లో ఎవరు నటిస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
తొలుత ఈ పాటలో అందాల ఆరబోతతో పాటు చిందులు వేసేందుకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.అయితే ఇప్పుడు ఈ బ్యూటీని పుష్ప చిత్ర యూనిట్ పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.
ఆమె ఒక్క పాటలో చిందులు వేసేందుకు భారీగా డిమాండ్ చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు మరో హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ను ఈ పాటలో నటించాల్సిందిగా చిత్ర యూనిట్ కోరేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికే టాలీవుడ్ జనాలకు ఎంతో దగ్గరైనా పాయల్ అయితే పుష్ప సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో ఆమెను ఈ సినిమాలోని పాటలో తీసుకునేందుకు సుక్కు అండ్ టీమ్ సిద్ధమయ్యారు.
కరోనా పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ను జరుపుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.