సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ తెగ ఫోటోలు షేర్ చేస్తూంటారు అన్న సంగతి తెలిసిందే.ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లను చేయించుకొని మరీ తెగ సందడి చేస్తుంటారు.
అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టలు, హాట్ లుక్ లతో రెచ్చిపోతూ కుర్రాళ్లను మత్తెక్కిస్తారు.ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ బ్యూటీ తన ఫోటో లతో వావ్ అనిపించేలా ఆకట్టుకుంది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా.
ఈమె పలు సినిమాలలో నటించగా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.మోడలింగ్ లో మాత్రం ఓ రేంజ్ లో క్రేజీ ని సొంతం చేసుకుంది.
ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ల కోసం తను పడే పాట్ల గురించి అంతా ఇంతా కాదు.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు ఫోటోల షేర్ లతో తెగ బిజీగా ఉంటుంది.
గ్లామర్ విషయంలో ఊర్వశి ఎంతమంది అభిమానుల మనసులని దోచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.అందులో ఊర్వశి పింక్ గులాబీ రంగులో కనిపించే వస్త్రధారణలో కనిపించగా కొండ రాతి పై నిల్చొని ఫోటోకు ఫోజు ఇచ్చింది.
ఇదిలాఉంటే ఇటీవలే సెకండ్ వేవ్ కరోనా వైరస్ ప్రారంభంలో డైమండ్ ఫేస్ మాస్క్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో గోపీచంద్ తో ఓ సినిమాలో నటిస్తుంది.
అంతేకాకుండా కలిసి ఓ సినిమాలో నటించనుంది.మొత్తానికి ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస సినిమాల అవకాశాలను సొంతం చేసుకుంది.