మెగా కాంపౌండ్ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.
దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్లారిటీ లేకుండా పోయింది.కాగా ఇటీవల సినిమా థియేటర్లు తెరుచుకోవడం, సంక్రాంతి బరిలో పలు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకోవడంతో ఉప్పెన చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తోంది.వీరిద్దరి మధ్య నడిచే లవ్ ట్రాక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ప్రేమికుల రోజున రిలీజ్ చేస్తే ఆ ఫీల్ వేరుగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మరి ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెన చిత్రంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.