టాలీవుడ్ లో ప్రస్తుతం ఉప్పెన సినిమా వేవ్ నడుస్తుంది.ఈ సినిమా సక్సెస్ అయిన దానికి మించి మీడియా పబ్లిసిటీ చేస్తుంది.
సినిమా గురించి సెలబ్రిటీలు అందరూ గొప్పగా చెబుతున్నారు.ఇక ఈ సినిమాత వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి స్టార్స్ గా మారిపోయారని సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా కితాబు ఇచ్చేశాడు.
ప్రేక్షకుల నుంచి సినిమాకి మంచి ప్రశంసలే లభిస్తున్నా కూడా ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారనే టాక్ కూడా ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా కలెక్షన్ ఏకంగా వంద కోట్లు ధాటిపోయినట్లు నిర్మాతలు ప్రచారం చేయడాన్ని కూడా కొంత మంది క్రిటిక్స్ టార్గెట్ చేస్తున్నారు.
ఇలాంటి ప్రేమకథలు ఇప్పటికే అన్ని బాషలలో వచ్చేసి ఆడేసి వెళ్ళిపోయాయి.అయితే ఇందులో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్స్, డైలాగ్స్ అందరికి భాగా కనెక్ట్ అయ్యాయని టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ మీద కొత్తగా చర్చ నడుస్తుంది.
కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ తనయుడు హీరోగా ఉప్పెన సినిమాని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే రీమేక్ రైట్స్ గురించి అక్కడ నిర్మాతలు సంప్రదిస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది.ఇప్పుడు దీనిని హిందీలో రీమేక్ చేయడానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయని బోగట్టా.సైరాట్ రీమేక్ ధడక్ తో బాలీవుడ్ కి తెరంగేట్రం చేసిన షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా ఈ సినిమాని రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయనే మాట వినిపిస్తుంది.
షాహిద్ కపూర్ కి జోడీగా అనన్యా పాండేని తీసుకోవాలని భావిస్తున్నట్లు బిటౌన్ లో వినిపిస్తున్న మాట.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.