మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయినటువంటి వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఈ చిత్రానికి ఇప్పటికే టైటిల్ ని కూడా ఉప్పెన అని ఖరారు చేశారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సంబంధించినటువంటి మొదటి లుక్ రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని దాదాపుగా ముఖ్య సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
అంతేగాక ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కాలంలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో ప్రముఖ తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. కానీ ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తున్నవటువంటి హీరోయిన్ గురించి మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకూ తెలపలేదు.దీంతో చిత్ర హీరోయిన్ ఎవరు అనే అంశంపై ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
అయితే కనీసం రేపు అయినా ఈ చిత్రంలో నటించిన టువంటి హీరోయిన్ ఎవరు అనేది చిత్ర యూనిట్ సభ్యులు చెబుతారో లేదో చూడాలి.