సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.అయితే ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే అందం, అభినయం, వంటివాటితో పాటు కూసింత అదృష్టం కూడా ఉండాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఎప్పటి నుంచో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఎలాగైనా ఒక్క అవకాశం దక్కించుకొని తమని తాము వెండి తెరపై చూసుకోవాలని అనుకున్న నటీనటులు కలలు కలలుగానే మిగిలిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.కానీ కొంతమంది నటీనటులకు మాత్రం వచ్చి రావడంతోనే మంచి హిట్ పడడంతో ఒక్కసారిగా వారి యొక్క రెమ్యూనరేషన్ మరియు స్టార్డం కి రెక్కలు వస్తున్నాయి.
కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన “ఉప్పెన” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ హీరోయిన్ “కృతి శెట్టి” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన నటనా ప్రతిభను నిరూపించుకోవడం మరియు తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ప్రస్తుతం వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
దీంతో తాజాగా నటి కృతి శెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ మధ్యకాలంలో తన పారితోషికాన్ని మరింత పెంచినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలైన రామ్ పోతినేని, సుధీర్ బాబు మరియు నేచురల్ స్టార్ నాని ఇతర హీరోల చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.దీంతో తాజాగా ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ దాదాపుగా మరో 50 లక్షల రూపాయలు పెంచినట్లు టాలీవుడ్ సినీ టౌన్ లో చర్చించుకుంటున్నారు.
అయితే పట్టుమని 18 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండనటువంటి యంగ్ హీరోయిన్ ప్రస్తుతం కోటి రూపాయలు కి పైగా పారితోషికం అందుకుంటుందంటే సామాన్య విషయం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే” ఆలోచన మంచిదే అయినప్పటికీ ఇల్లు చక్కబెట్టుకునే క్రమంలో దీపాన్ని ఆర్పి వేసుకుంటే పూర్తిగా చీకటి అవుతుందని కాబట్టి పారితోషికం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే సినీ కెరియర్ మరింత బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ప్రతి శెట్టి “నేచురల్ స్టార్ నాని” హీరోగా నటిస్తున్న “శ్యామ్ సింగరాయ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రానా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కావడంతో మంచి స్పందన లభించింది.కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.అయితే ఇటీవలే ఈ అమ్మడు టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న “మాచర్ల నియోజకవర్గం” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.