మెగా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయ్యింది.కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉప్పెన సినిమా ఎప్పుడో వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ను సాధించింది.కాని షేర్ విషయానికి వస్తే రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
జెన్యూన్ లెక్కల ప్రకారం ఈ సినిమా 40 కోట్లకు మించి అయితే వసూళ్ల రాబట్టింది.కాని ఇప్పటి వరకు ఈ సినిమా 50 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు.
అంత షేర్ వస్తే నిర్మాతలకు భారీ లాభాలు ఖాయం అంటున్నారు.రూ.50 కోట్ల షేర్ ఇంకా రాకున్నా ఒకటి రెండు రోజుల్లో రావడం పక్కా అంటున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే సినిమా రన్ తగ్గి పోయింది.
థియేటర్లు తగ్గాయి.
ఇలాంటి సమయం లో సినిమా వసూళ్లు మందగించే అవకాశం ఉంది.
కనుక ఉప్పెన సినిమా మెగా అభిమానులు మరియు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఇక 50 కోట్ల షేర్ ను దక్కించుకోవడం సాధ్యం కాదు అంటున్నారు.ఇప్పటికే సినిమా భారీ మొత్తంలో వసూళ్లు అయితే నమోదు చేశాయి.
నాల్గవ వారం సినిమా వసూళ్లు మరింతగా తగ్గే అవకాశం ఉంది.కనుక సినిమా ఆ బెంచ్ మార్క్ నెంబర్ ను మాత్రం వసూళ్లు చేయక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వసూళ్ల విషయం పక్కన పెడితే వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టిలు ఇండస్ట్రీలో స్టార్ లుగా ఎదగడం ఖాయం అని మాత్రం ఉప్పెన ప్రేక్షకులు అంటున్నారు.