వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఉప్పెన సినిమా తొలిరోజు నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.విడుదలకు ముందే అంచనాలు భారీగా పెరగడం, హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించడం, ఊహించని క్లైమాక్స్ ఉప్పెన సినిమాకు ప్లస్ కావడంతో పాటు సినిమా సక్సెస్ కావడానికి కారణమయ్యాయి.
అయితే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు ఉండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదలకు ముందు ఈ సినిమా 100 కోట్ల సినిమా అని అభిప్రాయం వ్యక్తం చేయగా అదే విధంగా సినిమా తొలి వారంలోనే ఏకంగా 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు.
అయితే మెగా ఫ్యాన్స్ ఉప్పెన కలెక్షన్ల లెక్కలను నెట్టింట వైరల్ చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ ను ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రేక్షకులు సైతం థియేటర్లకు వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఉప్పెన మూవీ ఊహించని స్థాయిలో రాబడుతున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.గ్రాస్ కలెక్షన్లకు, షేర్ కలెక్షన్లకు పొంతన లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్ల ట్రోలింగ్ పై మైత్రీ మూవీస్ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
గతంలో కూడా పలువురు స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల విషయంలో సైతం నిర్మాతలకు ఇదే తరహా ట్రోలింగ్ ఎదురైంది.
అయితే తొలి సినిమానే ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం హీరోగా వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ప్లస్ అయింది.అన్న సాయిధరమ్ తేజ్ మార్కెట్ 30 కోట్లకు అటూఇటుగా ఉంటే వైష్ణవ్ మాత్రం తొలి సినిమాతోనే 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.