కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్ లో రిలీజ్ అయ్యి అంచనాలకి మించి సూపర్ హిట్ అయిన చిత్రంగా ఉప్పెన నిలిచింది.ఈ మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా వచ్చిన ఈ సినిమాని మైత్రీ, సుకుమార్ సంయుక్తంగా నిర్మించగా బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.
ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే.ఇక వైష్ణవ్, కృతి శెట్టి జోడీగా వెండితెరపై అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా యువత నుంచి మంచి స్పందన రావడంతో పాటు ఈ మధ్య వచ్చిన ప్రేమ కథలలో బెస్ట్ మూవీ ఇదే అనే ప్రచారం జరిగింది.సినిమా రిలీజ్ కి ముందే ఇందులో పాటలు కూడా సూపర్ హిట్ అవడంతో అది కూడా సినిమా సక్సెస్ కి కలిసొచ్చింది.
ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఏకంగా వంద కోట్ల వరకు కలెక్ట్ చేసి అరుదైన రికార్డ్ ని సృష్టించింది అని నిర్మాతలు సైతం పబ్లిసిటీ చేసుకున్నారు.
ఒక డెబ్యూ హీరో మూవీకి వంద కోట్ల కలెక్షన్ రావడం టాలీవుడ్ చరిత్రలో అరుదైన ఘనతగా ప్రచారం చేశారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 18న స్టార్ మా చానల్ లో ఉప్పెన టెలికాస్ట్ అయ్యింది.అయితే థియేటర్ లో ఉప్పెన సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బుల్లితెరపై రాలేదని టాక్ వినిపిస్తుంది.
ఎవరైనా పెద్ద సినిమాలు బుల్లితెరపై ప్రదర్శిస్తే వారం రోజుల్లోపే దానికి సంబందించిన టీఆర్పీ రేటింగ్ ని చానల్ అధికారికంగా ప్రకటిస్తుంది.అలాగే సినిమా నిర్మాతలు కూడా ఆ టీఆర్పీ రేటింగ్ తో పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రచారం చేసుకుంటారు.
అయితే ఉప్పెన సినిమాకి మాత్రం అలాంటి ప్రచారం ఏమీ జరగలేదు అంటే అనుకున్న స్థాయిలో బుల్లితెరపై ఉప్పెన మూవీకి రెస్పాన్స్ రాలేదని, అందుకే బయటకి చెప్పడం లేదనే మాట వినిపిస్తుంది.మరి దీనిపై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలి.