ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమలకు చాలా ఆశను కలిగించింది.దాదాపు ఏడాది తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి.
ఏడాది కాలం పాటు థియేటర్లు లేక పోవడం వల్ల జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు.మళ్లీ థియేటర్ల వద్ద కనిపిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఉప్పెన సినిమా వచ్చి ఆ అనుమానాలను పటా పంచలు చేసింది.వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని రికార్డు బ్రేక్ చేసింది.
ఉప్పెన సినిమా తో అద్బుతమైన ఓపెనింగ్ ఈ ఏడాదికి వచ్చిందని.లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీకి ఇది మరో మంచి ఓపెనింగ్ అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉప్పెన జోరు అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది.
ఇటీవలే ఓటీటీ లో వచ్చిన ఉప్పెన సినిమా ను జనాలు పెద్ద ఎత్తున చూశారు.
సినిమా కు వచ్చిన రన్ టైమ్ చూసి అంతా ఆశ్చర్య పోయారు.ఇదే సమయంలో సినిమా ను టీవీ లో స్ట్రీమింగ్ చేశారు.సినిమా కు ఛానెల్ లో కూడా పెద్ద ఎత్తున ఆధరణ దక్కింది.స్టార్ మా లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా కు 18.5 రేటింగ్ దక్కినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఉప్పెన సినిమా తో దక్కించుకున్న రేటింగ్ స్టార్ మా స్థాయి మరింతగా పెరిగింది అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టీవీ మరియు ఓటీటీ ల్లో కూడా వంద కోట్ల కలెక్షన్స్ రేంజ్ లో ఉప్పెన సినిమా సక్సెస్ అయ్యింది.ఇంతటి సక్సెస్ సినిమా ను అందించిన బుచ్చి బాబును మరియు ఆయన గురువు సుకుమార్ ను ఖచ్చితంగా అభినందించాల్సిందే అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఉప్పెనతో పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా క్రిష్ దర్శకత్వం లో పూర్తి అయ్యింది.మూడవ సినిమా గిరీషయ్య దర్శకత్వంలో రాబోతుంది.