మెగా కాంపౌండ్ నుండి వస్తున్న సరికొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ అన్ని పనులను ముగించుకుని మరికొద్ది రోజుల్లో రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే ఈ సినిమాకు కూడా కరోనా ఎఫెక్ట్ తగలడంతో ఈ సినిమా రిలీజ్ను ఏకంగా నెల పాటు వాయిదా వేశారు.
అయితే ఈ సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాకు లింక్ పెడుతున్నారు సినీ వర్గాలు.
గతంలో ఉప్పెన సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేద్దామనుకుని, ఇప్పుడు ఏకంగా మే 7కు వాయిదా వేశారు.
ఇక ఈ సినిమాను సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అటు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమను సుకుమార్ డైరెక్ట్ చేయగా ఈ సినిమాను కూడా మే 7న రిలీజ్ చేశారు.
దీంతో ఇప్పుడు ఉప్పెన సినిమాను కూడా మే 7న రిలీజ్ చేస్తే ఆర్య సినిమాలాగా సూపర్ హిట్ అందుకుంటుందని పలువురు భావిస్తున్నారు.
ఇక ఆర్య సినిమాతో సుకుమార్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇప్పుడు ఆయన బాటలో ఆయన శిష్యుడు బుచ్చిబాబు కూడా తన గురువు బాటలో పయనించాలని చూస్తున్నాడు.
మరి ఈ సినిమాతో ఆర్య లాంటి సక్సెస్ను ఉప్పెన అందుకుంటుందో లేదో చూడాలి.