ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన జోడీ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. వీరిద్దరు జంట తెరపై ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని అద్బుతంగా పండించారు.
సుకుమార్ టీమ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ తో సంయుక్తంగా ఈ సినిమాని సుకుమార్ నిర్మించారు.
కరోనా లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.సినిమాలో విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లవ్ స్టొరీకి ప్రేక్షకులు భాగా కనెక్ట్ అయ్యారు.
ఈ సినిమా తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఏకంగా మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు.అలాగే కన్నడ బ్యూటీ కృతి శెట్టి కూడా సినిమా రిలీజ్ కాకుండానే రెండు సినిమాలు ఒకే చెప్పింది.
సినిమా రిలీజ్ తర్వాత హీరో రామ్ కి జోడీగా ఫైనల్ అయ్యింది.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆమె పేరు వినిపిస్తుంది.
అలాగే తమిళ్ లో ధనుష్ కి జోడీగా కృతి సనన్ ని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.
అంతే కాదు ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఆరంభం అయ్యేది మాత్రం వచ్చే ఏడాదిలోనే అని తెలుస్తుంది.
ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో వాళ్ళ డేట్స్ చూసుకొని సినిమా స్టార్ట్ చేయాలంటే కనీసం ఏడాది అయిన పట్టే అవకాశం ఉంది.