సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఉప్పెన సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన ఉప్పెన సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ సినిమా ఇంటర్వెల్ కు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సాధారణంగా సినిమాల్లో ఇంటర్వెల్ అంటే ఊహించని ట్విస్ట్ తో ఉంటుంది.అయితే ఈ సినిమాలో మాత్రం హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్ తో ఇంటర్వెల్ ఉండనుందని తెలుస్తోంది.
సినిమా అంతా పద్ధతిగా కనిపించే కృతి శెట్టి ఆ సన్నివేశంలో మాత్రం బోల్డ్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.
ఆ ఇంటర్వెల్ సీన్ కథను కూడా కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.హృదయాలను హత్తుకునే ప్రేమకథతో ఉప్పెన సినిమా తెరకెక్కనుండగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.రాయమన్ అనే పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారని తెలుస్తోంది.
విడుదలకు కొద్ది రోజులే ఉండగా అతి త్వరలో సినిమా ట్రైలర్ కూడా విడుదల కానుందని సమాచారం.
దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా నీ కన్ను నీలిసముద్రం పాట ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.
విడుదలకు ముందే ఈ సినిమా పాటలు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.