టాలీవుడ్ లో ఈమద్య కాలంలో హీరోయిన్స్ పారితోషికం విపరీతంగా పెరిగాయి.కొన్ని సంవత్సరాల ముందు వరకు కోటి రూపాయలు పారితోషికం అంటే బాబోయ్ ఆమెకు అంత పారితోషికం ఎందుకు అన్నట్లుగా కామెంట్స్ వినపించేవి.
కాని ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్స్ కు రెండు మూడు కోట్ల పారితోషికాలు దక్కతున్నాయి.నయనతార వంటి ముద్దుగుమ్మలకు ఏకంగా అయిదు ఆరు కోట్ల పారితోషికం ఇస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి.
ఇంతటి భారీ పారితోషికాలు అందుకుంటున్న వారు ఉన్న ఇండస్ట్రీలో కొత్త వారు సైతం భారీగా పారితోషికాలు అందుకుంటున్నారు.ఆఫర్లు రానప్పుడు.
సక్సెస్ లేనప్పుడు పది నుండి పాతిక లక్షల వరకు కూడా నటించేందుకు ముందుకు వచ్చే హీరోయిన్స్ ఒక్క హిట్ పడితే కోటిలో పడుతున్నారు.ఉప్పెన సినిమా కు 20 లక్షల పారితోషికం అందుకున్న కృతి శెట్టి ఉప్పెన రిలీజ్ కు ముందు రామ్ తో నటించేందుకు ఓకే చెప్పింది.
అందుకు గాను 50 కోట్ల లోపు పారితోషికంను అందుకుంది.కాని చైతన్యతో బంగార్రాజు సినిమాను చేసేందుకు గాను రెండు కోట్లు డిమాండ్ చేస్తుందట.
కృతి శెట్టి ఒకేసారి అంతగా పారితోషికంను పెంచడం పట్ల నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కోటి లోపు లేదా కోటి వరకు అయితే పర్వాలేదు కాని ఒకేసారి రెండు కోట్ల పారితోషికం ఈమెకే ఇస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంత, కాజల్, పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి వారికి ఎంత ఇవ్వాలంటూ నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.నెట్టింట కృతి శెట్టి పారితోషికం విషయం వైరల్ అవ్వడంతో అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు.మరీ ఇంత పారితోషికం ఏంటీ అమ్మడు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.పారితోషికం విషయంలో పునః సమీక్షించుకోకుంటే మాత్రం భవిష్యత్తులో హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.