మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో వంద కోట్లు దక్కించుకున్నాడు.ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా మొదటి సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దాఖలాలు లేవు.
అలాగే రెండవ సినిమాతో కూడా వంద కోట్లు కాస్త అటు ఇటుగా వసూళ్లు సాధించిన హీరోలు కూడా లేరు.అందుకే రెండవ సినిమా తో కూడా వైష్ణవ్ తేజ్ రికార్డును బద్దలు కొట్టబోతున్నాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా తో కనీసం 50 నుండి 60 కోట్ల వసూళ్లు రాబడితే ఖచ్చితంగా ఆ అరుదైన రికార్డు కూడా వైష్ణవ్ తేజ్ కు దక్కుతుంది అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు మరియు సినిమా ల విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలు చాలా రికార్డులు సాధించారు.
కాని వైష్ణవ్ వారందరిని కూడా మొదటి సినిమాతో పక్కకు నెట్టాడు.
ఇప్పుడు కొండ పొలం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వైష్ణవ్ తేజ్ పై చాలా పెద్ద భారమే ఉంది.
తెలుగు లో వైష్ణవ్ తేజ్ ఒక విభిన్నమైన హీరోగా పేరు దక్కించుకునేందుకు ఈ సినిమా ఉపయోగ పడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.కెరీర్ లో రెండవ సినిమాతోనే ఇంత పెద్ద భారంను నెత్తిన పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ లో వసూళ్లు సాధించకున్నా కూడా వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా తోనే అవార్డు దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ దక్కడం ఖాయం అంటున్నారు.ఉప్పెన సినిమా తో నటుడిగా మంచి పేరు దక్కించుకున్న వైష్ణవ్ రెండవ సినిమా కొండ పొలంతో మరో సారి నటుడిగా రెండు మూడు మెట్లు ఎక్కబోతున్నాడు.ఈవారంలో రాబోతున్న కొండ పొలం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.