మెగా హీరో వైష్ణవ్ తేజ్ఉప్పెన సినిమా తో ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇలాంటి సమయంలో వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.వైష్ణవ్ రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో పూర్తి అయ్యింది.
ఏ సమయంలో అయినా ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.మరో వైపు ఈ మెగా ఉప్పెన హీరో మూడవ సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఆయన సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ సినిమా కు దర్శకుడు ఎవరు అంటూ చర్చ జరుగుతున్న సమయంలో జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ పేరు పరిశీలనకు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నవీన్ పొలిశెట్టితో సినిమాను తీసిన అనుదీప్ తన తదుపరి సినిమా ను వైష్ణవ్ తేజ్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.జాతి రత్నాలు సినిమా ఓ రేంజ్ హిట్ ను అందుకుంది.
అందుకే ఈ సినిమా మరింత భారీ ఎత్తున సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.వైష్ణవ్ తేజ్ మరియు అనుదీప్ల కాంబోలో రూపొందబోతున్న ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో పాటు ఒక మంచి లవ్ స్టోరీని కూడా కలిగి ఉంటుందని అంటున్నారు.
అతి త్వరలోనే వీరి కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జాతి రత్నాలతో ఫుల్ లెంగ్త్ కామెడీఎంటర్ టైనర్ ను రూపొందించిన దర్శకుడు తదుపరి సినిమా ను యాక్షన్ మూవీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
వైష్ణవ్ తో యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.