సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఉప్పెన సినిమాతో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది.
ఏ హీరో మొదటి సినిమాకు.ఏ హీరోయిన్ మొదటి సినిమాకు ఏ దర్శకుడి మొదటి సినిమాకు రానంత వసూళ్లు ఈ సినిమాకు నమోదు అయ్యాయి.
రికార్డు స్థాయిలో నమోదు అయిన వసూళ్లు ఉప్పెన రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాయి.ఉప్పెన సక్సెస్ నేపథ్యంలో హీరో హీరోయిన్ మస్త్ బిజీ అయ్యారు.
ఒక్క సినిమాతోనే కోటి హీరోయిన్ అయిన కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి.ఇక వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు ప్రముఖ నిర్మాతలు భారీ అడ్వాన్స్ తో వెంట పడుతున్నారు.
ఇదే సమయంలో దర్శకుడు బుచ్చిబాబుకు కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయట.కాని ఆయన మాత్రం వెయిట్ అండ్ సీ దోరణి తో ఉన్నాడని తెలుస్తోంది.
ఉప్పన సినిమా ను మెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు.అయితే అది ఎప్పుడు ఏంటీ అనేది మాత్రం ఎన్టీఆర్ కూడా కన్ఫర్మ్ గా చెప్పలేదు.
అయినా కూడా ఎన్టీఆర్ ఓకే చెప్పాడు కదా మరో హీరో వద్దకు ఎందుకు వెళ్లాలని బుచ్చి బాబు భావిస్తున్నాడట.ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రంగస్థలం చిత్రం సమయంలో మహేష్ బాబు నుండి సుకుమార్ కు కాల్ వచ్చింది.సినిమా చేద్దాం అంటూ మహేష్ చెప్పడంతో వెయిట్ చేశాడు.
రంగస్థలం సినిమా విడుదల అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా తదుపరి సినిమాను సుకుమార్ విడుదల చేయలేక పోయాడు.కాని సమయంను వృదా చేయడం.
ఇండస్ట్రీ హిట్ పడ్డ తర్వాత సమయంను ఇంత వృదా చేయడం అనేది పిచ్చి పొరపాటు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సుకుమార్ విషయంలో విమర్శలు చేశారు.ఇప్పుడు అదే తరహాలో బుచ్చి బాబును కూడా ఉప్పెన వంటి సూపర్ హిట్ పడ్డ తర్వాత వెంటనే సినిమా చేసి క్యాష్ చేసుకోవాలి.
అంతే తప్ప ఎన్టీఆర్ కోసం చాలా కాలం వెయిట్ చేయడం మంచి నిర్ణయం కాదేమో అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బుచ్చి బాబు మనసు మార్చుకుని మరో సినిమాను చేస్తే బెటర్ అంటున్నారు.