మెగా ఫామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు వైష్ణవ్ తేజ్.సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా తర్వాత ఈ యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా కృతిశెట్టి నటించింది.ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి కథ సుకుమార్ అందించగా, సంగీత దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే నీ కళ్ళు నీలి సముద్రం సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండటంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అయితే ఇన్ని రోజులు ఈ సినిమా రిలీజ్ పై సందిగ్ధత నెలకొని ఉంది.
థియేటర్ లో రిలీజ్ చేయాలా, ఓటీటీలో చేయాలా అనే మీమాంసలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.సినిమాని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమాని ఏకంగా 18 కోట్లతో నిర్మించారు.
ఈ నేపధ్యంలో ప్రముఖ ఓటీటీ ఛానల్స్ తో ఇన్ని రోజులు చర్చలు నడిచాయి.అయితే ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతలు చెప్పిన అమౌంట్ ఇవ్వడానికి ఒకే చెప్పడంతో ఆ అఫీషియల్ గా ఆ ఛానల్ కి సినిమా రైట్స్ ఇచ్చేశారు.
దీంతో సదరు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఉప్పెన రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది.అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోయేది డేట్ మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు.
అయితే డిసెంబర్ నెలాఖరున లేదంటే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.