టాలీవుడ్ లో కొందరు స్టార్స్ ఓవర్ నైట్ లో అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.గత ఏడాది లో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి.
ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో స్టార్ హీరోయిన్ గా మారి పోయింది.ఆ సినిమా ఘన విజయం తర్వాత కృతి శెట్టి గత ఏడాది లో ఏకంగా అర డజనుకు పైగా సినిమా లు సైన్ చేసింది.
అందులో ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ సినిమా ను విడుదల చేయడం జరిగింది.గత ఏడాది చివర్లో శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు చివర్లో కూడా ఘన విజయంను సొంతం చేసుకుని 2021 ని ముగించింది.
ఇప్పుడు 2022 లో కృతి శెట్టి బంగార్రాజు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.బంగార్రాజు సినిమా ఘన విజయం సాధించడం ఖాయం అంటూ అంతా కూడా బలమైన నమ్మకంతో ఉన్నారు.
ఈ సంక్రాంతికి పెద్ద సినిమా లు ఏమీ లేక పోవడంతో బంగార్రాజు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంతో ఉన్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.కృతి శెట్టి బంగార్రాజు చిత్రంలో ఒక గ్రామంకు సర్పంచ్ గా కనిపించబోతుంది.అందుకు సంబంధించిన విషయం ఇప్పటికే లీక్ అయ్యింది.సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన మూడు నెలల్లోనే ముగించారు.నాగార్జున మరియు నాగచైతన్యలు హీరోలు గా ఈ సినిమాలో నటించారు.
నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి నటించడం జరిగింది.జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధిస్తే మళ్లీ 2022 ను కూడా కృతి శెట్టి సక్సెస్ తో ఆరంభించినట్లు అవుతుంది.
తద్వారా ఈ ఏడాది మరో మూడు నాలుగు సినిమా లతో ఆమె సక్సెస్ లు దక్కించుకుంటుంది అనే నమ్మకం అందరి లో కలుగుతుంది.మరి బంగార్రాజు సినిమా ఈ అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.