ఉప్పెన సినిమాతో బేబమ్మా పాత్రతో మెప్పించి ఓవర్ నైట్ లో స్టార్డమ్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి.తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకుంది కృతి.
తన అందంతో, నటనతో ఎంతో మంది యువత మనసులని దోచుకుంది.ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే మరో యంగ్ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాన్ని అందుకుంది.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పెన.ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమాతో వైష్ణవ్ కూడా తన నటనకు మంచి గుర్తింపు అందుకోగా.పలు అవకాశాలు కూడా అందుకున్నాడు.
ఇందులో హీరోయిన్ గా నటించిన కృతి యంగ్ హీరో తమ్ముడు సరసన నటించగా.తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది.
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడు.థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కృతి శెట్టి ను హీరోయిన్ గా తీసుకోనున్నట్టు సమాచారం.
ఇక ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోగా మొత్తానికి ఈ అమ్మడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ఇక ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో కూడా బిజీగా ఉంది ఈ అమ్మడు.అంతేకాకుండా మరో యంగ్ హీరో సుధీర్ బాబు తో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే సినిమాలో కూడా నటిస్తుంది.