కన్నడ ఇండస్టీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఉపేంద్ర.విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర కెరియర్ లో అందరి హీరోల తరహాలో కాకుండా కొత్తదనం ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ఉంటాడనే పేరుంది.
విభిన్న కథలని తెరపై ఆవిష్కరించే ఉపేంద్ర దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా తననితాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కబ్జా అనే పాన్ ఇండియా మూవీలో ఉపేంద్ర నటిస్తున్నాడు.
ఇక తాజాగా ఉపేంద్ర కన్నడ ప్రజలకి ఒక బహిరంగ లేఖ రాసారు.ఆ లేఖలో తనకి ముఖ్యమంత్రిగా చేయాలని ఉందని మనసులో మాటని బయట పెట్టాడు.
నిస్వార్ధంగా ప్రజల కోసం సేవ చేయడానికి తాను సీఏం కావాలని అనుకుంటున్నా అని తెలిపాడు.ఆ అవకాశం తనకి మీరు ఇస్తే నేను పూర్తి స్థాయి రాజకీయాలలోకి వస్తాననే విధంగా తన లేఖలో పేర్కొన్నారు.
నాకు సీఎం కావాలని ఉంది.ఎన్నికల్లో పోటీచేస్తే గెలిపిస్తారా?’ అంటూ లేఖను కర్ణాటక ప్రజలకు రాశారు.తాను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని పేర్కొన్నారు.సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని చెప్పారు.
తనను సీఎంగా చూడాలనే కోరికకు ప్రజల నిర్ణయమే శిరోధార్యం అని లేఖలో ఉపేంద్ర పేర్కొన్నారు.ఖర్చు చేసే ప్రతి పైసాకు తాను జవాబుదారీగా ఉంటానన్నారు.
ఉపేంద్ర లేఖపై సోషల్ మీడియాలో నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు.ఇప్పటికే ఉపేంద్ర రాజకీయాలలోకి వచ్చి పార్టీ కూడా ఏర్పాటు చేశారు.
తరువాత దానిని రద్దు చేసి మళ్ళీ కొత్త పార్టీని ప్రకటిస్తా అని పేర్కొన్నాడు.అయితే అదేమీ జరగలేదు.
ఇప్పుడు ఈ లేఖని ఉన్నపళంగా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశాడు అనేది ఆసక్తికరంగా మారింది.