సౌత్ ఇండియాలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఉపేంద్ర.కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా, విభిన్న కథా చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఉపేంద్ర ప్రస్తుతం కబ్జా అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఇదిలా ఉంటే ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ పాత్రలని తెలుగులో చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకి కూడా ఉపేంద్ర భాగా చేరువయ్యాడు.
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో రాయలసీమ లీడర్ గానటించి అల్లు అర్జున్ తో సమానమైన పాత్రలో తెరపై కనిపించి ఉపేంద్ర తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ గని కోసం టాలీవుడ్ కి వస్తున్నాడు.
వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న గని సినిమాలో ఉపేంద్ర చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇందులో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో తాజాగా ఉపేంద్ర జాయిన్ అయ్యాడు.
హైదరాబాద్ లో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.ఇందులో ఉపేంద్రపైన కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మాతగా అడుగుపెడుతున్నాడు.