కన్నడ నటుడు ఉపేంద్రకు తెలుగులో మంచి పేరు ఉంది.కొన్ని సంవత్సరాల క్రితం ఈయన నటించిన ప్రతి కన్నడ సినిమా తెలుగులో డబ్ అయ్యేది.
ఉపేంద్ర నటించిన పలు సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి.ఈయనకు తెలుగులో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.
అయితే గత కొంత కాలంగా ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు.ఈయన కెరీర్లో భారీ హిట్గా నిలిచిన ‘ఉపేంద్ర’ సినిమాకు తాజాగా సీక్వెల్ను తీసుకు వస్తున్నాడు.
ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.కన్నడతో పాటు తెలుగులో సైతం ఈ సినిమా ఓకే సారి చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇటీవలే మెగా మూవీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన ఉపేంద్ర ఈసారి తెలుగు ప్రేక్షకులను తన హీరోయిజంతో మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.‘ఉపేంద్ర 2’ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత నల్లమల్లపు బుజ్జి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.ఇప్పటికే ఈయన హక్కులను దక్కించుకున్నాడు.
పారుల్ యాదవ్, క్రిష్టినాలు హీరోయిన్స్గా నటించారు.‘ఉపేంద్ర’ మొదటి సినిమాలాగే ఈ ‘ఉపేంద్ర 2’ కూడా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.