ఆధార్ కార్డు విషయంలో 10 ఏళ్లకు ఒకసారి అంతా అలా చేయాల్సిందే

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇటీవల కీలక ప్రకటన చేసింది.ప్రజలంతా పది సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలని సూచించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లను కలిగి ఉంది.1.5 లక్షల పోస్ట్‌మెన్‌లను ఆన్‌బోర్డ్ చేసే ప్రక్రియలో ఉంది.వారంతా మొదట ఆధార్ హోల్డర్ల మొబైల్ నంబర్‌లు, చిరునామాలను అప్‌డేట్ చేస్తారు.

ప్రజలు ఆధార్ కార్డ్ డేటాను అప్‌డేట్ చేయడంపై సమాచారాన్ని UIDAI పంచుకుంది.ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేసుకోవచ్చని చెప్పింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ప్రజలు 10 సంవత్సరాలకు ఒకసారి వారి బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్స్ డేటాను అప్‌డేట్ చేయమని UIDAI ప్రజలకు సూచించింది.

కాలక్రమేణా, ఇది వారి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.అయితే ఈ విషయంలో 70 సంవత్సరాలు దాటిని వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.

Advertisement

ప్రస్తుతానికి, 5 మరియు 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను మాత్రమే అప్‌డేట్ చేయాలి.ముఖ్యంగా, UIDAI మేఘాలయ, నాగాలాండ్, లడఖ్‌లలో కొద్ది శాతం మంది మినహా దేశంలోని పెద్దలందరినీ ఆధార్ నమోదు చేసింది.

ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) సమస్య కారణంగా మేఘాలయలో నమోదు ఆలస్యంగా ప్రారంభమైంది.నాగాలాండ్, లడఖ్‌లలో, కొన్ని మారుమూల ప్రాంతాలను కవర్ చేయలేకపోయారు.

UIDAIకు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లు ఉన్నాయి.ఆయా సెంటర్ల ద్వారా ఆధార్ అప్‌డేట్ కోసం ప్రత్యేకంగా 1.5 లక్షల పోస్ట్‌మెన్‌లను వినియోగిస్తోంది.పోస్ట్ మ్యాన్‌ల సాయంతో ఆధార్ అప్‌డేట్ చేస్తోంది.

UIDAI అనేక రాష్ట్రాలతో కూడా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి, లబ్ధిదారుల నకిలీలను తొలగించడానికి, నిధుల లీకేజీలను నిరోధించడానికి, ప్రజాధనాన్ని ఆదా చేయడానికి చర్చలు జరుపుతోంది.ప్రయాణీకుల కోసం ప్రయాణాలను పేపర్‌లెస్‌గా మార్చాలని విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

డిజియాత్ర కూడా ప్రయాణికుల ధృవీకరణ కోసం ఆధార్‌తో అనుసంధానించబడుతుందని UIDAI అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు