యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను ‘జిల్’ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతున్నా, ఈ సినిమాకు సంబంధించి పెద్దగా అప్డేట్లు లేకపోవడం గమనార్హం.
దీంతో రాధేశ్యామ్ చిత్ర యూనిట్పై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజులో మండిపడుతున్నారు.ఈ క్రమంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ చిత్రం నుండి ఓ భారీ అప్డేట్ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.
అయితే ఈ సినిమా టీజర్ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు యూవీ క్రియేషన్స్ తెలిపారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
అయితే టీజర్ వస్తుందని ఆశించిన ప్రేక్షకులు, ఇప్పుడు మోషన్ పోస్టర్తో రాధేశ్యామ్ నెట్టుకొస్తుండటంతో మరోసారి నిరాశకు గురయ్యారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తోండగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నాయి.మరి ఈ సిినిమా మోషన్ పోస్టర్కు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.