కింగ్ నాగార్జున హోస్ట్గా సెప్టెంబర్ 6న ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం నాల్గువ వారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు దర్శకుడు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి మరియు యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది హాట్ టాపిక్గా మారింది.ఈ వారం నామినేషన్స్లో అభిజిత్, లాస్య, మెహబూబ్, హారిక, సయ్యద్ సోహైల్, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి ఈ వారం ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు.
అయితే వీరిలో సయ్యద్ సోహైల్, మెహాబూబ్.వీరిద్దరిలో ఒకరు ఈ వారం బ్యాగ్ సర్దేస్తారని ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే.హైపర్ యాక్టివ్గా ఉండే సోహైల్ టాస్కులు వచ్చాయంటే.
డెడికేషన్ పెట్టి ఆడటంతో పాటు ఇంటి సభ్యులందరిపై ఆవేశంతో విరుచుకు పడిపోతున్నాడు.ముఖ్యంగా నిన్న జరిగిన కిల్లర్ కాయిన్ టాస్క్లో నోటి దురుసు చూపించడంతో.
మిగిలిన ఇంటి సభ్యులందరూ సోహైల్నే టార్గెట్ చేశాడు.
ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ మాస్టర్తో గొడవ పడిన సోహైల్.
అందరిలోనూ బ్యాడ్ అయ్యాడు.అయితే సోహైల్ ఆవేశమే.
ఇప్పుడు ఎలిమినేషన్ వరకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు మెహబూబ్ టాస్కుల్లో ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తుండడంతో.
నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నాడు.గత టాస్కులో కూడా మెహబూబ్, సోహైల్ చాలా అడ్వాన్స్ అయ్యారు.
దీంతో వారిద్దరి పై నెగటివ్ టాక్ వచ్చింది.
ఇక ఎలిమినేషన్లో ఉన్న వారిలో లాస్య, హారిక, స్వాతి దీక్షిత్, అభిజీత్ సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పాలి.
కుమార్ సాయిని ఇంటి సభ్యులందరూ ప్రతి సారి టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో.ప్రేక్షకుల్లో అతడికి సింపథీ పెరిగిపోయింది.దీంతో అతడు ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు.మొదట్లో కాస్త ఓవర్ చేసిన అరియానా కూడా ఇప్పడు హౌస్లో దూసుకుపోతుందని చెప్పాలి.
మరి వీరితో పోల్చుకుంటే.సోహైల్, మెహబూబ్లే డేంజర్ జోన్లో ఉన్నారు.
దీంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని ప్రచారం కూడా ఊపందుకుంది.