పండగ వచ్చిందంటే చాలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఎప్పుడు మెగా హీరోలతో సందడిగా ఉంటుంది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పండుగ వేడుకలకు దాదాపుగా మెగా హీరోలు అందరూ హాజరయ్యారు.అయితే ఇందులో మెగా బ్రదర్ నాగేంద్రబాబు మరియు పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు మాత్రం ఇతర కారణాల వల్ల హాజరు కాలేకపోయారు.
కానీ ఈ వేడుకలకు వారి తరఫున పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హాజరయ్యారు.అయితే మెగాస్టార్ చిరంజీవి కోడలు అయినటువంటి ఉపాసన తన అత్త సురేఖ వాణి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగానని అలాగే రామ్ చరణ్ పెళ్లి చేసుకున్న తరువాత తన అత్త అయినటువంటి సురేఖ వాణి తనకు అన్ని విషయాల్లోనూ అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
అంతేగాక తనకి అవసరమైన సమయంలో సలహాలు ఇస్తూ ఇంటిని చక్కగా చక్కదిద్దుతుందని అన్నారు.అంతే కాకుండా తాజాగా సంక్రాంతి సంబరాలు వేడుకలు ఏర్పాట్లలో కూడా తను సహాయం అందించారని అన్నారు.ఒకవైపు బిజినెస్ చూసుకుంటూ మరోవైపు ఫ్యామిలీ పనులను చూసుకుంటూ తాను ఇలా ఉండడానికి కారణం తన అత్త సురేఖ వాణీ అని ఉపాసన చెప్పుకొచ్చింది.