ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే. పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఆ తర్వాత ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.
మహేష్ బాబు ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా చేయబోతున్నాడు.
అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఇంకా కెజిఎఫ్ 2 సినిమాతో యష్ కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా వ్యాప్తంగా సౌత్ నుండి రిలీజ్ అయినా సినిమాల్లో రాధేశ్యామ్, ఈటీ, బీస్ట్ వంటివి ఆకట్టుకోలేక పోయాయి.
ఇలా స్టార్ హీరోలు దాదాపు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతున్నారు.ఇక ఇప్పుడు మరికొంత మంది పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
జూన్ లో మరొక నాలుగు పాన్ ఇండియా సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యాయి.మేజర్, విక్రమ్, అంటే సుందరానికి, 777 ఛార్లీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యాయి.
అడవి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మేజర్. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాను మహేష్ బాబు నిర్మించడం విశేషం.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది.
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఇక విక్రమ్ సినిమాలో కమల్ హీరోగా నటించాడు.ఈ సినిమాలో సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రల్లో నటించారు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా జాన్ 3న రిలీజ్ కాబోతుంది.
తెలుగు, హిందీ, మలయాళ, తమిళ్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 777 ఛార్లీ.
కిరణ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జూన్ 10న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమాల్లో ఏది పాన్ ఇండియా హిట్ అవుతుందో ఏది ప్లాప్ అవుతుందో చూడాలి.