మూగజీవాలపై ప్రేమ చూపండి అంటున్న ఉపాసన

రామ్ చరణ్ భార్యగా కంటే అపోలో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ, సోషల్ యాక్తివిస్ట్ గా ఉపాసన సొసైటీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్న సమయంలో చాలా మంది ఆమె బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన వాటిని లెక్క చేయకుండా, తనని తాను మార్చుకొని ఇప్పుడు ఎంతో మంది యువతకి ఆదర్శంగా నిలుస్తుంది.

 Upasana Tweet On Spend Time With Animals In Lock Down, Tollywood, Ram Charan, Co-TeluguStop.com

ఆమె ఒక రోల్ మోడల్ లా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో వన్యప్రాణి సంరక్షణపై సోషల్ మీడియాలో విభిన్నంగా అవగాహన పెంచుతున్న ఉపాసన తాజాగా కరోనా లాక్ డౌన్ కారణంగా మూగజీవాలు పడుతున్న బాధలపై ట్విట్టర్ లో స్పందించింది.

లాక్ డౌన్ సమయంలో జంతువులను నిర్లక్ష్యం చేస్తున్నారని, కొంత మంది వాటి పట్ల తీవ్రంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.వాస్తవానికి జంతువులతో ఉండడం అంత ప్రమాదమేమీ కాదని ఆమె చెప్పుకొచ్చారు.

తన ట్విట్టర్ ఖాతాలో తన గుర్రానితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసిన ఉపాసన స్వీయ నిర్బంధమే కానీ, నా డార్లింగ్ డేయిసీకి దూరంగా కాదు.జంతువుల పట్ల ప్రేమ, సంరక్షణను చూపించాల్సిన అసలైన సమయం ఇదే.కొంత మంది క్రూరులు ఈ లాక్‌డౌన్ టైంలో జంతువులను వదిలిపెడుతున్నారు.మీ జంతువుల పట్ల మీరు చూపించే ప్రేమ, సంరక్షణ మీలోని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది అని పోస్ట్ చేసింది.

ఈ పోస్టుపై కొంతమంది పోజిటివ్ గా స్పందిస్తూ ఉంటే మనుషుల ప్రాణాలకే దిక్కులేని సమయంలో ఈ జంతువుల మీద ఎవరు ప్రేమ చూపిస్తారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube