మెగా ఫ్యామిలీ కోడలు,మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన శుభవార్త చెప్పింది.తనకు కలిగిన ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకుంది.
ఈ మధ్య ఎలాంటి విషయం అయినా కూడా సెలబ్రిటీలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగానే ముందుగా తెలియజేస్తున్నారు.ఆ తరువాతే ఇంకెవరికైనా తెలుస్తుంది.
ఆలా ఏ విషయాన్నీ ఆంయినా సోషల్ మీడియా లో పంచుకొనేవారిలో ఉపాసన ముందుంటుంది.ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అని ఆలోచిస్తున్నారా.
ఏమీ లేదు, రామ్ చరణ్ వాళ్లు ఫిల్లీ అనే పేరు తో ఒక గుర్రాన్ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ ఫిల్లీకి పిల్ల పుట్టింది.
అది చాలా అందంగా ఉందంటూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది ఉపాసన.తల్లి గుర్రంతో ఉన్న పిల్ల గుర్రం ఉన్న ఫొటోను అందరికీ చూపించింది.
అది పుట్టిన వేళా విశేషం బాగుందనీ, తాము ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తల్లి,పిల్ల గుర్రం ల ఫోటోలు పెట్టి షేర్ చేసింది.అంతేకాకుండా ఆ పిల్ల గుర్రానికి ఏదైనా పేరు పెట్టడానికి సలహా ఇవ్వండి అంటూ నెటిజెన్లనే కోరింది.
మరోపక్క ఇంత మంచి శుభవార్త చెప్పడంతో… మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నట్లు సమాచారం.ఉపాసన పెట్టిన ఫొటోకు నెటిజన్స్ కూడా తెగ లైక్స్ కొడుతున్నారు.పిల్ల గుర్రం అలా పక్కన పెడితే ఉపాసన నుంచి మరో శుభవార్త వినాలని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.మరి ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాలి.