టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అయినటువంటి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ఒకపక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూనే మరోపక్క వ్యాపారాల్లో బిజీబిజీగా గడుపుతోంది.అయినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తోంది.
అయితే నిన్నటి రోజున అంతర్జాతీయ పులుల దినోత్సవం కావడంతో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఉపాసన కొణిదెల స్పందించింది.అయితే ఇందులో భాగం గంగా ఓ పులి పిల్ల కి పాలు పట్టిస్తున్న ఫోటోని జోడించి అంతర్జాతీయ పులుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసింది.
మనం హైదరాబాదులో నివసిస్తుంటే పులులు దూరంగా అడవిలోనే నివసించి ఉన్నాయని కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని పేర్కొంది.
దీంతో కొందరు మెగా అభిమానులు ఉపాసన పులి పిల్లలకు పాలు పట్టిస్తున్న ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.
అంతేగాక మెగా కోడలు అంటే ఆ మాత్రం ధైర్యం ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ సంస్థ విభాగంలో ప్రధాన పదవిలో కొనసాగుతూ ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్య చిట్కాలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తోంది.