గత కొంత కాలంగా భారతీయులందరూ విచారించే పరిస్థితిలో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి.ఓ వైపు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ప్రాణాలు కోల్పోతూ ఉండగా మరో వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తుంది.
ఇంకో వైపు సరిహద్దు వద్ద చైనా, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.ప్రజలకి ఏ విధంగా కూడా ప్రశాంతత లేని పరిస్థితులు చుట్టుముట్టి ఉన్నాయి.
ఈ నేపధ్యంలో స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి కూడా తన జీవితంలో వరుస విషాదాల గురించి భావోద్వేగమైన ట్వీట్ చేసింది. 20 రోజుల్లో పలు విషాద ఘటనలు తమను కలిచి వేసేలా చేశాయంటూ ఉపాసన వ్యాఖ్యలు చేసింది.
తమ కుటుంబంలో ముగ్గురు పెద్దవారిని కోల్పోయామని, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి బాధాకర వార్త విన్నామని, దేశంలో కరోన కేసులు ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయని తెలిపింది.మన దేశాన్ని రక్షించడానికి జవాన్లు ప్రాణాలు ఇస్తున్నారని గుర్తు చేసింది.
సరిగ్గా వారం రోజుల క్రితం తమ 8వ పెళ్లి రోజు తేదీ వచ్చిందని, అయితే, దాన్ని జరుపుకునే మూడ్ లో తామిద్దరం లేమని తెలిపింది.అందుకే, ఆ రోజు ఇంట్లో మూడు రకాల ఆవకాయ పచ్చడితో అన్నం తింటూ, చిప్స్ నములుతూ, టీవీ చూస్తూ గడిపామని చెప్పింది.
ఇలాంటి సమయంలో కలిసి ఉండటం కంటే గొప్ప ఆనందం ఇంకేమి ఉంటుందని పేర్కొంది.