రాణిని దత్తత తీసుకున్న ఉపాసన.. మెగా ఫ్యాన్స్‌ ఆనందం

మెగా ఫ్యాన్స్‌ ఉపాసన బర్త్‌డేను నిన్న సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జరుపుకున్నారు.

సోషల్‌ మీడియాలో ఆమెను ప్రశంసలతో ముంచెత్తి ఆమెకు బర్త్‌డే విశెష్‌ను తెలియజేశారు.ఇక ఉపాసన కూడా నిన్న తన బర్త్‌డే సందర్బంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అపోలో ఫౌండేషన్‌ ద్వారా మామూలుగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహణ కార్యక్రమాలు నిర్వహించే ఉపాసన నిన్న నెహ్రూ జూ పార్క్‌ ను సందర్శించింది.

ఈ సందర్బంగా అక్కడ రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు.ఏడాది పాటు ఆ ఏనుగు పోషణకు అయ్యే ఖర్చు అంతా తన ఫౌండేషన్‌ చూసుకుంటుందని హామీ ఇచ్చింది.

అందుకు గాను ముందస్తుగా అయిదు లక్షల రూపాయల చెక్కును జూ అధికారికి ఉపాసన అందించడం జరిగింది.

కరోనా కారణంగా జూను సందర్శించేందుకు జనాలు రాకపోవడం వల్ల నిర్వాహణ ఇబ్బందిగా అవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు రావాలంటూ జూ అధికారులు విజ్ఞప్తి చేశారు.

దాంతో ఉపాసన ముందుకు వచ్చి రాణి ని దత్తత తీసుకుంది. """/"/ ఏనుగును దత్తత తీసుకుని తన మంచి మనసును చాటుకున్న ఉపాసనపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

మెగా ఫ్యాన్స్‌ నీ అంత మంచి మనసున్న మహిళ తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు.

చరణ్‌ మరియు ఉపాసనల జోడీ అద్బుతం అంటూ మరికొందరు ప్రశంసలు కురిపించారు.మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ ఉపాసన విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు.

Viral : ఇదేందయ్యా ఇది.. మాజీ ప్రియురాలి టాయిలెట్ చోరీ చేసిన ప్రియుడు..