టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన కొణిదెల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేగాక సమాజానికి అవసరమైనటువంటి పలు విషయాల గురించి కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
అయితే తాజాగా ఉపాసన కొణిదెల చేసినటువంటి ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజాగా ఉపాసన కొణిదెల పాడైపోయిన నిరోదులు, మరియు బట్టలతో తయారు చేసినటువంటి దుస్తులను ధరించింది.
అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.అయితే ఇందులో భవిష్యత్తులో పర్యావరణానికి ఎలాంటి హాని చేయనటువంటి ఇలాంటి దుస్తులకు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపింది.
అలాగే మీరు ఇలాంటి దుస్తులను ధరి స్తారా….? అంటూ సవాల్ విసిరింది.అయితే ఎప్పుడూ పర్యావరణం, సమాజం, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి ఉపాసన కొణిదెలకి నెటిజనులు మద్దతు తెలుపుతున్నారు.
అయితే ఉపాసన కొణిదెల గతంలో కూడా కరోనా వైరస్ మహమ్మారిని నివారించేందుకు ఉపయోగించే మాస్కులు మరియు శానిటైజర్లను ఇంటి వద్దనే ఎలా తయారు చేసుకోవాలనే అంశంపై కూడా అవగాహన కల్పించింది.
అంతేగాక తన భర్తతో కలిసి తన మామ చిరంజీవి కరోనా బాధితులకు సహాయం చేయడానికి నెలకొల్పిన టువంటి ట్రస్ట్ కి కూడా సహాయం అందించింది.ప్రస్తుతం ఉపాసన ఒక పక్క తన కుటుంభం బాధ్యతలను చక్కదిద్దుతూనే మరో పక్క వ్యాపారాలు, సమాజ సేవ అంటూ బిజిబిజీ గా గడుపుతోంది.