తన సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ మధ్య వన్యప్రాణి సంరక్షణ బాద్యతని తీసుకొని దాని కొడం నాడు భిగించిన మెగాస్టార్ కోడలు ఉపాసన ఆ మధ్య భర్త రామ్ చరణ్ తో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో జంతువులతో ఫోటోలు దిగారు.ఇదిలా ఉంటే ఈ మధ్య అంతరించిపోయే స్టేజికి వచ్చిన పక్షులు, జంతువుల మీద దృష్టిపెట్టిన ఉపాసన వీటిపై తన ఫేం ని ఉపయోగించుకొని ప్రజలలో అవగాహనా పెంచడం కోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుంది.
ఇప్పటికే ఏపీ రాష్ట్ర పక్షి రామచిలుకతో ఫోటో షేర్ చేసి వాటిని బంధించాకండి రక్షించండి అంటూ ప్రచారం చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఉపాషణ తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్టపై ఫోకస్ పెట్టింది.
పాలపిట్ట గురించి అనేక ఆసక్తికర అంశాలను నెటిజన్లతో ఆమె పంచుకుంది.పాలపిట్టను ఇంగ్లీషులో ఇండియన్ రోలర్ బర్డ్ అనే అంటారని, దీని శాస్త్రీయనామం కొరాసియస్ బెంగాలెన్సిస్ అని చెప్పింది.
దీనికున్న నీలి వర్ణం కారణంగా హిందీలో పాలపిట్టను నీల్ కాంత్ అంటారని దసరా వంటి పండుగ సమయాల్లో పాలపిట్టను చూడడం పూజించడాన్ని పవిత్రంగా భావిస్తారని చెప్పింది.ఈ కారణంతోనే పాలపిట్టలను పట్టుకోవడం బంధించడం చేస్తారని చెప్పింది.
ఈ కారణంగా వీటి సంఖ్యలో గణనీయంగా తగ్గిపోయాయని వీటి కాపాడుకోవాలని కోరింది.