తాజాగా ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా అయినటువంటి ట్విట్టర్ లో ఖాతా తెరిచిన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ విషయానికి సంబంధించి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు మరింత దగ్గరవడం కోసం సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నట్లు ఇప్పటికెకే వీడియో ద్వారా తెలిపాడు.
అయితే మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.అంతేగాక ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు సార్ హీరోలు చిరంజీవిని ట్విట్టర్ కి స్వాగతించారు.
తాజాగా మెగా స్టార్ చిరంజీవికి తన కోడలు ఉపాసన కూడా గ్రాండ్ గా వెల్ కమ్ పలికింది.అంతేగాక ఈ విషయానికి సంబంధించి ఓ ట్వీట్ ని కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇందులో వెల్కమ్ టు ట్విట్టర్ మామయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపింది.దీంతో మెగాస్టార్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 49 వేల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మెగాస్టారుకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అని.
అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.
అయితే ప్రస్తుతం కరుణ వైరస్ కలకలం సృష్టిస్తున్న డంతో కొంతకాలం పాటు ఈ చిత్రం షూటింగ్ని వాయిదా వేశారు.