మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉపాసన ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య సూత్రాలను పంచుకోవడంతో పాటు ఉపాసన సెలబ్రిటీల హెల్త్ సీక్రెట్లు ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు.
దసరా సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఉపాసన చరణ్ తో పాటు రామ్ చరణ్ తల్లి సురేఖ, సోదరి శ్రీజలతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఉపాసన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేయగా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలకు లక్షకు పైగా లైక్స్ రావడం గమనార్హం.
మరోవైపు చరణ్ దసరా పండుగ రోజున రెండు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేశారు.
రామ్ చరణ్ హీరో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది.ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కాగా శంకర్ సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమాల షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
ప్రశాంత్ నీల్ ఇప్పటికే కమిటైన సినిమాలను పూర్తి చేసి చరణ్ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు.చరణ్ ప్రాజెక్టుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆర్ఆర్ఆర్ తర్వాత నటించే సినిమాలు తన్ క్రేజ్ ను మరింత పెంచాలని చరణ్ భావిస్తున్నారు.