మెగా కోడలు ఉపాసన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.దోమకొండ గడికోటలో ఉపాసన సోదరి అనుష్పల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది.
ఈ వేడుకలలో భాగంగా కుటుంబ సాంప్రదాయం ప్రకారం పోచమ్మ పండుగ జరిగింది.ఈ వేడుకకు చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరు కావడం గమనార్హం.
ఉపాసన సోషల్ మీడియా ద్వారా చెల్లి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఉపాసన పోచమ్మ పండుగ వేడుకలలో వేసుకున్న దుస్తులను రీ క్రియేట్ చేసి తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకుంటున్నానని తెలిపారు.
దుస్తులతో వెల కట్టలేని ఎమోషన్స్ ఉంటాయని నాణ్యతతో ఉండే వస్త్రాలను షాపింగ్ చేయడం తనకు ఇష్టమని ఉపాసన అన్నారు.దుస్తులు వేసుకోవడం వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవడం తనకు గర్వంగా ఉంటుందని ఉపాసన చెప్పుకొచ్చారు.
దాదాపుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత తన పెళ్లికి సంబంధించిన దుస్తులను రీక్రియేట్ చేసినందుకు అనామికా ఖన్నాకు ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సమంత ఈ పోస్ట్ కు బ్యూటిఫుల్ అని కామెంట్ పెట్టారు.ఉపాసన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
మరోవైపు ఉపాసన భర్త చరణ్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు.ఈ నెల 9వ తేదీన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల కానుండగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన చరణ్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.చరణ్ శంకర్ కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.వచ్చే ఏడాది ఈ సినిమా తర్వాత షెడ్యూల్ మొదలు కానుందని తెలుస్తోంది.