ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఖంగు తిన్నాడో వ్యక్తి.భయంతో విలవిల్లాడిపోతూ.
నన్ను ఎన్ కౌంటర్ చేయొద్దు లొంగిపోతానంటూ మెడలో బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు.తాను పోలీసులకు లొంగిపోతానని అంతే కాకుండా జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని రాసిన ఓ అట్టముక్కపై రాసి మెడకు తగిలించుకున్నాడు.
అయితే సీఎం యోగి ఆదిత్య నాథ్ ఏమన్నారు, ఈ యవకుడు ఎందుకు అలా చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్.
నేరాలకు పాల్పిడతే ఎన్ కౌంటర్ చేస్తామంటూ కామెంట్లు చేశారు.దీంతో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇలా వినూత్న ప్రదర్శన చేస్కుంటూ వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.
లోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 9న ఓ హత్య జరిగింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకు్న పోలీసులు.
దర్యాప్తు చేపట్టారు.అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.
మరొకరు పరారీలో ఉన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ కౌంటర్ చేస్తామని హెచ్చరించగా.
హడలిపోయిన సౌహైల్ మెడలో బోర్డు వేసుకొని మరీ లంగిపోయాడు.అంతకుముందు ఓ మహిళతో సంబంధం పెట్టుకొని హత్య చేసిన కేసులోనూ సహైల్ నిందితుడిగా ఉన్నాడు.
అయితే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులను వదిలి పెట్టమని.వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు హెచ్చరించారు.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.