ఈ మధ్య కాలంలో మహిళలలో అత్యాచారాలు దేశంలో తీవ్రం అయిపోతున్నాయి.ఒంటరి మహిళలని లక్ష్యంగా చెసుకొని, అలాగే ప్రేమ పేరుతో లోబరుచుకొని సామూహికంగా అత్యాచారం చేసి, హత్యలు చేసే ప్రబుద్ధులు ఎక్కువైపోతున్నారు.
తాజాగా అంతకంటే దారుణమైన ఉదంతం యూపీలో చోటు చేసుకుంది.ఓ వ్యక్తి అప్పు పది వేలు అప్పు చెల్లించడానికి బదులు మహిళని అమ్మేయడం, ఆపై ఆమె పలువు ఇళ్ళల్లో పని చేయడం, అదే సమయంలో ఆమె మీద సామూహిక లైంగిక దాడికి పాల్పడటం సంచలనంగా మారింది.
ఇక తనపై జరుగుతున్న అత్యాచారాలపై బాధిత మహిళ పోలీసులని ఆశ్రయించగా వారు నిర్లక్ష్యం చేయడంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం ఘజియాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.ఇప్పుడు ఈ ఉదంతం సంచలనంగా మారడంలో పోలీస్ ఉన్నతాధికారులు ముందుకొచ్చి ఆమె ఫిర్యాదుపై ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుసుకొని వారి మీద యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.
ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై సిఏం యోగి లేఖ రాసారు.ఆమె ఆత్మహత్యాయత్నంకి కారణం అయిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని బాధితురాలికి అండగా నిలబడాలని ఆదేశించారు.