తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ మొగల్ గా పేరు సంపాదించుకున్న వారిలో నిర్మాత రామానాయుడు ఒకరు.ఈయన నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈయన తర్వాత వెంకటేష్ నటించిన బొబ్బలి రాజా సినిమాతో సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈయన నిర్మాతగా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించారు.
అయితే ఈ మధ్యకాలంలో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబుకు సైతం ఇదే ప్రశ్న ఎదురయింది.
సినిమా ఇండస్ట్రీలో మూవీ మొగల్ గా ఉన్నటువంటి రామానాయుడు గారి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాని ఎప్పుడు తీస్తున్నారు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సురేష్ బాబు సమాధానం చెబుతూ అందరూ ఇదే ప్రశ్న గురించి అడుగుతున్నారు అయితే తన తండ్రి బయోపిక్ చిత్రం చేయాలనే ఆలోచన కూడా తనకు రాలేదని సురేష్ బాబు వెల్లడించారు.మామూలుగా మా కుటుంబం వ్యక్తిగత విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతాము.
మా వ్యక్తిగత విషయాలలోకి సినిమా విషయాలను అసలు ప్రస్తావించము.
నాన్నగారి బయోపిక్ చిత్రం చేయాలంటే వ్యక్తిగత విషయాలను కూడా చూపించాల్సి ఉంటుంది.అలాకాకుండా ఆయన సినీ జీవితం గురించి మాత్రమే చూపిస్తే ప్రేక్షకులకు చాలా బోర్ కొడుతుందని, సినిమా జీవితంలో కూడా నాన్నగారికి కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, వాటిని చూపించి ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదనే నాన్నగారి బయోపిక్ చిత్రం చేయాలనుకోవడం లేదు అంటూ సురేష్ బాబు తెలిపారు.ఇకపోతే ప్రస్తుత కాలంలో వచ్చిన ఏ బయోపిక్ సినిమాలో అన్ని నిజాలు చెబుతున్నారు బయోపిక్ చిత్రం అనే పేరు కానీ అందులో ఎవరు కూడా వాస్తవాలను చూపించడం లేదని,కొందరు మార్చి చూపించగా మరికొందరు అదే నిజమని నమ్మించి సినిమాలను చేస్తున్నారు అంటూ ఈయన బయోపిక్ చిత్రాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.