కరోనాతో యూపీ మంత్రి మృతి... !

కోవిడ్-19 రాష్ట్రాల్లో చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది.దేశంలో వైరస్ వల్ల మరణాల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి.

 Up Minister Dies With Corona Up Minister, Dies, Corona-TeluguStop.com

సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఎవరిని వదలడం లేదు.దేశంలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక కరోనా కేసులు భారీగా పెరిగాయి.

ఇప్పటికే దేశంలో పలు ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.వెద్యానికి రియాక్ట్ అయిన వాళ్లు కోలుకుంటున్నారు.

కొందరు మృత్యువాత పడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శర వేగంగా విస్తరిస్తోంది.

కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ తీవ్రత అధికమవుతోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రి కమల రాణి కరోనాతో మృతి చెందింది.గత నెలలో కరోనా లక్షణాలు రావడంతో స్థానిక ఆస్పత్రిలో కరోనా చికిత్స చేయించుకున్నారు.

నిర్ధారణ పరీక్షలు పూర్తయిన తర్వాత రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.దీంతో ఆమె జూలై 1వ తేదీ నుంచి లక్నోలోని కరోనా ఆస్పత్రిలో చేరారు.చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని వైద్యులు వెల్లడించారు.దీంతో రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రి కమల రాణి మృతితో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube