సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..!!

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా లక్షల్లో బయట పడుతున్న సంగతి తెలిసిందే.దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితి ఇండియాలో దాపురించిందని ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం తెలిసిందే.

 Up Cm Yogi Adithyanath In Self Quarataine  Uttar Pradesh,  Yogi Adityanath ,-TeluguStop.com

అంత మాత్రమే కాక ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగం చేయాలని కోరారు.పరిస్థితి ఇలా ఉండగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతూ ఉన్నారు.

అలాగే దేశంలో వివిధ రాష్ట్రాల నాయకులు మరియు కేంద్ర మంత్రులు కూడా కరోనా బారిన పడటం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న చాలామంది కరోనా బారిన పడటంతో ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళినట్టు వెల్లడించారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విజృంభణ భారీ స్థాయిలో ఉంది.రోజువారి కేసులు పెరుగుతూ ఉన్న జిల్లాలలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుంది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube