మెగా ఇంటి నుంచి వచ్చిన అనేక మంది హీరోల్లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా ఒకడు.రామ్ చరణ్ తర్వాత ఎక్కువ సినిమాలు తీసిన వారసుడిగా సాయి ధరమ్ తేజ్ కి పేరు ఉంది.అయితే ఇతడి కెరీర్ స్టార్ట్ అయ్యి దాదాపు దశాబ్దం కాలం గడుస్తుంది.2014 లో పిల్ల నువ్వు లేని జీవితం అంటూ తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు సాయి.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో టాలీవుడ్ కి మరొక చిరంజీవి దొరికాడు అని భావించారు అంత.ఈ సినిమాలు బెస్ట్ మేల్ డెబ్యూ అఫ్ తెలుగు మరియు సౌత్ అనే రెండు అవార్డు గెలుచుకున్నాడు అలాగే ciniMAA అవార్డు తో పాటు సంతోషం అవార్డు కూడా దక్కించుకున్నాడు.
అంతే కాదు చిరంజీవి హిట్ పాటలు ఎక్కువగా రీమేక్ చేసిన ఘనత కూడా సాయి ధరమ్ తేజ్ కె దక్కుతుంది.ఇంత వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏటా రెండు సినిమాల చొప్పున నటిస్తూ వస్తున్న సాయి కి మొదటి సినిమా స్థాయిలో విజయాలు దక్కడం లేదు.ఉన్నంత లో బెటర్ అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, చిత్రలహరి సినిమాల గురించి చెప్పుకోవచ్చు.ఇక పరాజయాల సంగతి పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ జీవితంలో అతి పెద్ద విషయం అతడికి జరిగిన ప్రమాదం.
ఈ ప్రమాదం సాయి ని చాల రోజుల పాటు మంచానికే పరిమితం చేసింది.మొత్తానికి కోలుకున్న సాయి మళ్లి సినిమాలను లైన్ లో పెట్టడం స్టార్ట్ చేసాడు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా( Virupaksha Movie ) ద్వారా అతడికి వచ్చిన పేరు అయితే ఏమి లేదు.సంయుక్త మీనన్ కి కథ పరంగా మంచి స్కోప్ లభించి ఆమె సినిమా హిట్ యొక్క మేజర్ రోల్ ని దక్కించుకుంది.ఈ సినిమా విజయం సాధించిన సాయి కి దక్కిన లాభం అయితే పెద్దగా లేదు.ఇక షూటింగ్ జరుపుకుంటున్న మరొక సినిమా బ్రో.( Bro Movie ) ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో కూడా సింహబాహం పవన్ కళ్యాణ్ కి దక్కే అవకాశం ఉంది.
తద్వారా సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అది పవన్ ( Pawan Kalyan ) తర్వాత మాత్రమే సాయి కి ఆ క్రెడిట్ దక్కుతుంది.ఇలా పేరు రాని సినిమాలను చేస్తూ చాల ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు సాయి ధరమ్ తేజ్.