ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.ఈ కాలంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా వైరస్ నుండి బయటపడలేం.
ఇంకా భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకు అతి దారుణంగా విజృంభిస్తుంది.కేవలం నిన్న ఒక్క రోజే ఏకంగా 40 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం సాధారణ విషయం కాదు.
ఇంకా ఈ నేపథ్యంలోనే కేంద్ర మెకానికల్ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (సీఎంఈఆర్ఐ) ఓ సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది.ఆ ఆవిష్కరణ నెటిజన్లు, అధికారులు అందరూ ఆహా ఓహో అంటూ పొగిడేస్తున్నారు.
ఎందుకు అంతలా అనుకుంటున్నారా? దీనికి ఒక కారణం ఉంది.
కరోనా వైరస్ ఇంత దారుణంగా విజృంభించి వేలమందిని బలి తీసుకుంటున్న ఎంతోమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
కనీసం మాస్కు ధరించడం లేదు.అందుకే సరికొత్తగా ఓ ఆవిష్కరణతో వారు అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు.
కార్మికులు ప్రవేశించే సమయంలో ఉష్ణోగ్రతలను కొలిచే బడ్డీ కియోస్క్ ని ఆవిష్కరించింది.
పని ప్రదేశంలో కార్మికుల భద్రతే లక్ష్యంగా కేంద్ర మెకానికల్ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ ఈ కియోస్క్ ని ఆవిష్కరించింది.
ఇంకా ఇది కార్మికులు మాస్కులు ధరించకుంటే వెంటనే ఇందులోని ప్రత్యేక సాఫ్ట్ వెర్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేస్తుంది.ఏది ఏమైనా సీఎంఈఆర్ఐ నిజంగానే సరికొత్త ఆవిష్కరణతో అందరిని ఆశ్చర్యపరిచింది కదా! మరి మీరు ఏం అంటారు.